ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ఆప్తుడనే పేరున్న ఎంపీ ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరి తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సుజనా చౌదరి తీరు రాజకీయాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన అమర్నాథ్ ఊసరవెల్లి సైతం ఉరేసుకునేలా చంద్రబాబు తీరు ఉందని వ్యాఖ్యానించారు.
రాజధాని మార్పు పేరుతో చంద్రబాబు చేస్తున్న ఉద్యమం పక్కా అవకాశవాదానికి మారు పేరని గుడివాడ అమరనాథ్ అన్నారు. చంద్రబాబు ఉద్యమం తన భూముల రేట్ల కోసమేనని వ్యాఖ్యానించారు. ``చంద్రబాబు రోజుకో స్ర్కిప్ట్, రోజుకో లొకేషన్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని, సీనియర్ నేతలు అని చెప్పుకునే చంద్రబాబు తీరు ఇదేనా? తన రక్తం మరిగిపోతోందని చంద్రబాబు అనడం చిత్రంగా ఉంది. ఆయన రక్తం ఎందుకు మరుగుతోంది? ఇసుక దోపిడీ ఆగిపోయిందని చంద్రబాబు రక్తం మరుగుతోందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథాకాలను చూసి రక్తం మరుగుతోందా? దీనికి జవాబివ్వండి` అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
చంద్రబాబు కాస్తా చందాల బాబుగా మారిపోయాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ఎద్దేవా చేశారు. ``మహాత్మా గాంధి పోరాటం సమాజం కోసం, బాబు పోరాటం తన జాతి కోసం. చంద్రబాబుతో కలిసి పోరాటాలు చేస్తోంది party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ పార్టీనా...చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియానా? చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు మనుషులు మాత్రమే వేరు. మనసులు కలిసే ఉన్నాయి. సుజనా స్కూల్ మారింది. సిలబస్ మాత్రం టీడీపీదే ఆయన అనుసరిస్తున్నారు. సుజనా తీగ లాగితే చంద్రబాబు డొంక కదులుతుంది. దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా సుజనా మాట్లాడారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి`` అని అమరనాథ్ డిమాండ్ చేశారు.