చంద్రబాబునాయుడును వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఫుల్లుగా ట్విట్టర్లో చెడుగుడు ఆడేస్తున్నాడు. ప్రతిరోజు వివిధ అంశాలపై చంద్రబాబును కామెంట్ చేస్తునే లేకపోతే ఆరోపణలు, విమర్శలతోనో వాయించేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. చంద్రబాబు కరస్పర్శ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిందట.  చంద్రబాబు కలిసిన వారంతా నడినెత్తిన  శివతాండవం చేస్తున్నట్లు గిలగిల్లాడిపోతున్నారంటూ ఎగతాళి చేశారు.

 

తీహారు జైలుకెళ్ళిన వారు, ఐటి, ఈడి నోటీసులందుకున్న పెద్దలు సారు ’స్పర్శ’ కరోనా వైరస్ కన్నా పవర్ ఫుల్ అని నిర్ధారించారంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. అహ్మద్ పటేల్ లాంటి ఉద్దండులకూ హవాలా ఉచ్చు  బిగిసిదంటే  మామూలు విషయమా ? అంటూ ఈ ఎంపి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.

విజయసాయి అన్నారని కాదుకానీ ముందు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రముఖుల్లో కీలక వ్యక్తి అయిన  చిదంబరం ఈడి కేసుల్లో తగులుకున్నారు. తర్వాత తీహార్ జైలుకు కూడా వెళ్ళారు. అదే సమయంలో కర్నాటక కాంగ్రెస్ ప్రముఖుల్లో ఒకడైన డికె శివకుమార్ కూడా ఐటి, ఈడి దర్యాప్తు సంస్ధల కేసులతో ఇబ్బంది పడ్డారు. తర్వాత జైలుకు కూడా వెళ్ళారు.

 

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలో దేవేగౌడ్ తరపున, ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ తరపున, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ తరపున, తమిళనాడులో డిఎంకె అధినేత స్టాలిన్ తరపున, తెలంగాణాలో కాంగ్రెస్ తరపున చంద్రబాబు ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. విచిత్రమేమోగాని పై రాష్ట్రాల్లో చాలా వరకూ  బిజెపి దాదాపు స్వీప్ చేసింది.  నరేంద్రమోడిని ఓడించటమే ఏకైక టార్గెట్ గా అప్పట్లో చంద్రబాబు పావులు కదిపినా ఉపయోగం లేకపోయింది. దాని పర్యవసానమే ఇపుడు నరేంద్రమోడి, అమిత్ షా లు చంద్రబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మరి ఈ సమస్యల నుండి చంద్రబాబు ఎలా బయపడతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: