ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసింది ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు రికార్డు స్థాయి లో నమోదవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం భయాందోళన లో మునిగి పోతుంది. ఎటువైపు నుంచి కరోనా వైరస్ సోకుతుందో అని అందరూ భయపడి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ను ప్రకృతి కూడా భయ పెడుతోంది. మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో... ఆంధ్రప్రదేశ్ లోని నది పరివాహక ప్రాంతాల వారి జనజీవనం స్తంభించి పోయింది అన్న విషయం తెలిసిందే.




 భారీగా వరదల కారణంగా... కొన్ని కొన్ని ప్రాంతాలు గ్రామాలు సైతం పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్ళి పోయాయి. దీంతో కరోనా  వైరస్ తో పోరాడుతూనే మరోవైపు ప్రకృతి నుంచి కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతోమంది పోరాడారు. ఇక ఆ తర్వాత వర్షాలు తగ్గడం తో ఇప్పుడిప్పుడే మొన్నటి వరదల్లో కలిగిన నష్టం నుంచి బయట పడుతున్నారు. కానీ ప్రస్తుతం మరోసారి కొన్ని ప్రాంతాల ప్రజలకు వర్షాల కారణంగా ముప్పు  పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.



 ప్రకాశం జిల్లాలో అల్పపీడన పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని... లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్యం ఉండే విధంగా చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశించిన మంత్రి బాలినేని... ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో కరోనా  వైరస్ విస్తరించకుండా తగిన చర్యలు చేపట్టాలి అంటూ తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ అంతరాయాలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: