తెలంగాణాలో ఒక పక్క బిజెపి బలపడటం మరో పక్క ఉద్యోగుల సమస్యలు మరో పక్క ఇప్పటి వరకు మాట్లాడని కొన్ని వర్గాలు మాట్లాడటం వంటివి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది అనే విషయం చెప్పవచ్చు. తెలంగాణా సర్కార్ చర్యల మీద కొన్ని వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పథకాలపై సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులకు షాక్ తగిలింది.

ఎర్రబెల్లి దయాకర్ రావు.. నిరంజన్ రెడ్డి.. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. సభా వేదిక ముందు సర్పంచుల నిరసన కార్యక్రమం జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా చేసారు.  సభలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసారు సర్పంచులు... ఈ సందర్భంగా సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తాం... కుర్చీలో కూర్చోండి అంటూ  మంత్రులు విజ్ఞప్తి చేసారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఛలో పాలమూరు చేపట్టారు సర్పంచులు. జిల్లా కేంద్రంలో సర్పంచుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.

మంత్రుల సమావేశంలో నిలబడి నిరసన తెలిపిన సర్పంచులు... సమావేశాన్ని బహిష్కరించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. సర్పంచుల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేసారు. సర్పంచుల తీరుపై మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేసారు. కొంత మంది కావాలని గొడవ చేయాలని చూస్తున్నారు అని మంత్రి మండిపడ్డారు. తప్పుడు సంకేతాలు పంపకండి అని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేసారు. సర్పంచుల బాధలు వినాలే వచ్చినం అని మంత్రి చెప్పినా సరే వినలేదు. దీనితో వద్దంటే వెళ్లి పోతామంటూ ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేసారు. సమస్యలపై చర్చిద్దామని సర్పంచులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీతో సమావేశంల సర్పంచులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: