బియ్యం గింజ చూడడానికి ఎంత చిన్నగా ఉంటుందండి. అటువంటి బియ్యం గింజ పై  అక్షరాలు రాయడమే ఎంతో కష్టం. కానీ అటువంటి బియ్యం గింజల పై ఏకంగా పెద్ద గ్రంథమే రాసింది ఈమె. ఆ గ్రంధం ఏమిటో తెలుసా... ? మన భారతీయ ఆత్మకు ప్రతిరూపం, కోట్లాది భారతీయుల ఆరాధ్య గ్రంథం భగవద్గీత. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో.... వివరాలు ఇవే పూర్తిగా చూసేయండి. హైదరాబాద్ కి చెందిన  రామగిరి స్వారిక మైక్రో ఆర్టిస్టు గా పేరు పొందింది. ఆమే ఈ కృతువు పూర్తి చేసింది. ఈమె దేశం లోనే తొలి మహిళా మైక్రో ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది.

తనకి ఎప్పుడూ కళలు, సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువ. గడిచిన నాలుగు సంవత్సరాలుగా బియ్యపు గింజల మీద కళాకృతులు వేయడం మొదలు పెట్టింది ఈమె . తాజాగా ఆమె రాసిన బియ్యపు గింజల మీద భగవద్గీత మాత్రం అద్భుతంగా మారింది . ఈమె ఎల్ఎల్బీ చదువుతోంది. స్వారిక కి న్యాయ మూర్తి కావాలనేది కోరికని చెప్పారు. మహిళలకు స్ఫూర్తిగా నిలవాలనేది తన ఆకాంక్ష అని ఆమె వివరించారు. ఈ బియ్యం గింజల తో భగవద్గీత విషయానికి వస్తే....... 4,042 బియ్యపు గింజల పై భగవద్గీతను రాశారు ఈమె. మొత్తం 36,378 అక్షరాల తో కూడిన 9,839 పదాలను రాయడానికి 150 గంటల సమయం తీసుకున్నారు స్వారిక.  

గతం లో ఆమె సూక్ష్మ కళాకారిణిగా  ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. అలానే  నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్ స్వారికకు 'రాష్ట్రీయ పురస్కార్'ను అందజేసింది.  గతేడాది నవంబర్ 26న (న్యాయ దినోత్సవం) వెంట్రుకల పై రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఈమె ఎన్నో మైక్రో ఆర్ట్స్ చేసి అందరి ప్రశంసలు పొందడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: