ఏపీ జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్... టీడీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు. పోలవరం కు ఖర్చు చేసిన 2200 కోట్లు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ కొత్త అంశం లేవనెత్తిందని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారన్నారు. కొన్ని సంవత్సరాలు పాటు జరిగే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక సార్లు అంచనాలు పెరుగుతాయన్నారు. 2014 నుండి 2016 వరకు కేవలం 265 కోట్ల రూపాయల పని మాత్రమే చేశారని ఆయన తెలిపారు.

స్పెషల్ ప్యాకేజ్ లో బాగంగా పోలవరం తీసుకొచ్చినట్టు టిడిపి ఊదర కొట్టిందని ఆయన వివరించారు. 2014 వరకు ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తాను అని కేంద్రం చెప్పిందన్నారు. పోలవరం మేమే తీసుకుని పని చేస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం కోరిందని, 2017 మార్చిలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం లో అప్పగించాలని నిర్ణయించారని, అప్పుడే మేము 2014 తర్వత లెక్కల ప్రకారం నిధులు ఇవ్వము అని మెలిక పెట్టారన్నారు. ఆరోజు కేంద్ర క్యాబినెట్ లో టిడిపి నాయకులు ఉన్నారని ఆయన గుర్తు చేసారు.

2010 ప్రకారమే భూ సేకరణ ప్యాకేజ్ చెల్లిస్తాం అని చెప్పారని ఆయన తెలిపారు. 2014 అంచనాలు ఆమోదించి మాకు ఆ డబ్బులు ఇచ్చేయండి అని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారన్నారు. అంతా ఒప్పుకుని 2018 తర్వాత చంద్రబాబు రచ్చ చేయడం మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. తాను చేసిన తప్పులకు చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారని మండిపడ్డారు. తప్పులు అన్ని టిడిపి చేస్తే మేము క్షమాపణలు చెప్పాలా? అని మండిపడ్డారు. పోలవరం కోసం 72 సార్లు వెళ్లాను అని చెపుతున్న చంద్రబాబు... నిర్వాసితుల కి కోసం వెళ్ళారా?  అని నిలదీశారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడ్డారు అని ఆయన ఆరోపించారు. కమిషన్ల కోసం త్వరగా పూర్తి చేయాలని పరిగెత్తారు చంద్రబాబని మండిపడ్డారు. కనీసం టీడీపీకి చెందిన కేంద్ర  క్యాబినెట్ సభ్యులు దానిని వ్యతిరేకించారా? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: