ఈ వ్యక్తి అడ్డా కూలీ మహిళలను టార్గెట్ చేస్తాడు. కూలీల అడ్డా దగ్గరకి వచ్చి..... నగలున్న లేడీస్నుచూస్తాడు . ఆ తర్వాత వాళ్ల దగ్గర బేరం స్టార్ట్ చేసి.....  ఇంకేముంది పని ఉంది రమ్మని ఆఖరికి మందు తాగించి రేప్ అండ్ మర్డర్ చేస్తాడు. ఆ తరవాత ఒంటి పై నగలను తీసుకొని డెడ్ బాడీని రోడ్డు పై పడేస్తడు. ఈ వివరాలని  బాలా నగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. అయితే మూడు చోరీ కేసుల్లోనూ అతడు వాంటెడ్ అఫెండరని చెప్పారు ఆమె. అయితే అసలేం జరిగింది....? పూర్తి వివరాల్లోకి వెళితే..... ఇప్పటికి నాలుగు హత్యలు చేసాడు కిల్లర్ ఎల్లప్ప.

కర్నాటకలోని గుల్బర్గ పోల్కంపల్లికి చెందిన కొడుదుల ఎల్లప్ప అలియాస్‌ రవికుమార్‌ (48) స్టోన్‌ కట్టర్‌గా పని చేస్తున్నాడు. మేడ్చల్‌ జిల్లా హనుమాన్‌నగర్‌లో ఉంటున్నాడు. ఇంట్లో పని పేరుతో తీసుకెళ్లి అత్యాచారం, హత్య, దోపిడీ చేసేవాడు. మెదక్‌ జిల్లా ఎల్దుర్తి రామంతపూర్ తండాకు చెందిన విజయ(22)ను రూమ్‌ క్లీనింగ్‌ పేరుతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత  రెండు మందు బాటిళ్లు తీసుకెళ్లి తాగించాడు. తర్వాత ఆమె పై అత్యాచారం చేసి బంగారం, వెండి తీసుకునేందుకు ప్రయత్నం చేసాడు. కానీ  ఆమె అడ్డుకోవడంతో ఆమె పై బలంగా దాడి చేశాడు. ఆఖరికి ఆమెని హత్య చేశాడు. మేడ్చల్‌ రైల్వే గేట్‌ వద్ద ఉన్న రాళ్ల కుప్పలో పడేశాడు.

విజయ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి  పోలీసులు కంప్లైంట్‌ ఇచ్చారు.  పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు.  విజయ డెడ్‌ బాడీని గుర్తించారు. ఎల్లప్పని శుక్రవారం అరెస్టు చేశారు.  ఎల్లప్ప లేబర్‌ అడ్డాలనే టార్గెట్‌ చేసి వరుస నేరాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్‌, వికారాబాద్‌ జిల్లా పెద్దముల లో ఇలాంటివే మూడు రేప్‌ అండ్‌ మర్డర్స్‌ చేసినట్లు ఆధారాలు సేకరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: