ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం కరోనా రికవరీ రేటులో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఎంతో మెరుగ్గా ఉందనే చెప్పాలి. దీంతో మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు, బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ భయంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. కరోనాపై యుద్ధం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిం చారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రు ల్లోని ప్రతీ బెడ్కు ఆక్సిజన్ సౌకర్యాన్ని అందు బాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల పడకలుండగా, వాటిల్లో 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యముంది. మిగిలిన 11 వేల పడకలకు కూడా ఆక్సిజన్ను అందు బాటులోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా అదుపులోనే ఉంది. సోమవారం వెల్లడైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 10 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,948కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,390 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 8,42,416కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 19, చిత్తూరులో 32, తూర్పు గోదావరిలో 104, గుంటూరులో 117, కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరులో 30, ప్రకాశంలో25, శ్రీకాకుళంలో 19, విశాఖలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.