ఒకప్పుడు కేవలం డబ్బున్న వారి దగ్గర మాత్రమే మంచి మొబైల్ ఫోన్లు ఉండేవి. కాని ప్రస్తుతం వారు వీరు అనే తేడా లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగదారులకు నెట్వర్క్ అందించేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల టెలికాం రంగ సంస్థలు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒక మొబైల్ వినియోగదారుడు ఒకరితో కాల్ మాట్లాడాలి అంటే ఒక నెట్వర్క్ కు సంబంధించిన సిమ్ కొనుగోలు చేసి దానిని మొబైల్లో పొందుపరిచి ఆ తర్వాత ఫోన్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక నుంచి సిమ్ కార్డు లేకుండానే ఫోన్ మాట్లాడడానికి అవకాశం ఉంది.
అదెలా అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం ఇలాంటి ఓ సరికొత్త టెక్నాలజీ తెరమీదకు వచ్చేస్తుంది. దీంతో ఇక నుంచి సిమ్ కార్డు లేకుండానే ఇతరులతో ఫోన్ మాట్లాడే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సిమ్ కార్డు ద్వారా మీకు నచ్చిన టెలికాం సబ్స్క్రిప్షన్ ను ఎంచుకొని కాల్స్ మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సపోర్ట్ చేసే మొబైల్ లో ఈ సిమ్ ప్రొఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ సదుపాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఆపరేటర్లు తమ వినియోగదారులకు సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి.