ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించడంపై ఏపీ హైకోర్టు.. రాష్ట్ర పోలీసు శాఖపై తీవ్రంగా కోపాన్ని వ్యక్తం చేసింది.ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పై చాలా ఆగ్రహం చూపించింది హైకోర్టు. ఎస్సీ రైతులను 18 రోజులుగా జైల్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించింది. ఇలా చేయడం రైతుల ప్రాథమిక హక్కులు దెబ్బ తింటాయని రైతుల ప్రాధమిక హక్కులకు చాలా అంటే చాలా భంగం కలిగించడమేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం కరాఖండిగా తెలిపింది. హైకోర్టు లో రైతుల పట్ల తోడుగా వారి తరఫున ప్రముఖ న్యాయవాది అయిన  ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించగా ఆయన వాదనలతో హైకోర్టు ధర్మాసనం మంచిగా  ఏకీభవించింది.

రైతులను అరెస్ట్ చేసేందుకు ఎందుకు సరైన కారణాలు చూపించలేదని ఆంధ్ర ప్రదేశ్  పోలీసు శాఖపై హైకోర్టు చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కారం కింద తీసుకొనే అధికారం ఉందని కూడా హైకోర్టు న్యాయ స్థానం స్పష్టంగా వెల్లడించింది. పోలీసులు మన భారతదేశ రాజ్యాంగం  ప్రకారమే నడుచుకోవాలని, ఇలా చేస్తే ప్రజలు ఎక్కడకెళ్తారని తప్పుబట్టింది.


పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్‌ కూడా సరిగా లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలా అయితే ‘రూల్ ఆఫ్ లా’ ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది.కాగా, ఈ మధ్యనే రాజధాని అయిన  అమరావతిలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బేడీలు వేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు ఎస్సీ రైతులపై  అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది.


ఈ విషయం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన కారణంగా తాజాగా హైకోర్టు సైతం తన ఆగ్రహాన్ని  వ్యక్తం చేయడం జరిగింది..ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ల గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: