ఇదిలా ఉంటే , కార్యకర్తల సమావేశంలో ఎన్నో అంశాలపై తన మనసులో ఉన్న అభిప్రాయాలని
పవన్ బయటకు వెళ్లగక్కారు. అధికారం మాకు బాధ్యత, అలంకారం కాదు. అజమాయిషీ చేయడానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారు. వైయస్సార్
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం , ఇసుక అమ్ముకోవడం కోసం, మద్యం అమ్ముకోవడానికి నేను సీఎం అవ్వాలి అనుకోలేదు అంటూ
పవన్ పరోక్షంగా
జగన్ పై సెటైర్స్ వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల వ్యవహారశైలి పైన
పవన్ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
ఫోటో తీసుకోనివ్వలేదు అని నాపై కోపం చూపించకండి. మిగిలిన వారు 25 కేజీల బియ్యం ఇవ్వాలని చూస్తుంటే, నేను 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాను.రైతుల కోసం,
అమరావతి రైతు కోసం, లాఠీలు విరిగినా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించిన కార్యాచరణ ను ప్రకటిస్తాము అంటూ వ్యాఖ్యానించారు.