హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. అయితే ముషీరాబాద్‌లోని భోలక్ పూర్ వార్డులో మాత్రం ఎంఐఎం పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం గ్రేటర్ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదు కాగా, రామ్ నగర్ లో మాత్రం 48.58 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఇక్కడ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీకే చెందిన మహమ్మద్ అఖీల్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఘన విజయ సాధించారు.

ఈసారి కూడా ఇక్కడ అలాంటి ఫలితమే వచ్చింది. భోలక్ పూర్ డివిజన్ లో ఎంఐఎం అభ్యర్థి గౌస్ ఉద్దీన్ మహమ్మద్ ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆర్ విశ్వేశ్వరయ్య ఇక్కడ గట్టి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత అంత పోటీ తెలుగు దేశం పార్టీ నుంచి ఎదురైంది. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున బింగి నవీన్ కుమార్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ వాజిద్ హుస్సేన్, టీడీపీ నుంచి మహమ్మద్ జహీరుద్దీన్ సమర్ గ్రేటర్ బరిలో నిలిచారు. వీరిలో ఎంఐఎం అభ్యర్థి గౌస్ కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. భోలక్ పూర్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం విశేషం. నూర్ ఉల్ హసన్, మహమ్మద్ మెహబూబ్ హుస్సేన్, సానా ఉల్లా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసి గ్రేటర్ బరిలో నిలబడ్డారు. వీరు కూడా ఇక్కడ మంచి పోటీ ఇచ్చారనే చెప్పాలి. అయితే చివరకు విజయం మాత్రం ఎంఐఎం అభ్యర్థి గౌస్ ఉద్దీన్ మహమ్మద్ నే వరించింది.


దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: