అమ్మాయి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కష్టాలను ఎదుర్కోవాలి .. ఆడ పుట్టుక పుట్టిన తర్వాత ఇక భరించాలి.. పెళ్ళీడు వరకు తల్లి దండ్రులు కష్టపడి కాపాడి, ఒక అయ్య చేతిలో పెడితే అతను నూరేళ్ళు చూసుకుంటానని నమ్మించి దారుణాలకు పాల్పడుతున్నారు. పిల్లలు పుట్టలేదని కొందరు అతి దారుణంగా చంపేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి అమానుష ఘటన ఎదురైంది. కొడుకుకు పెళ్ళై నాలుగేళ్లు అయిన కూడా పిల్లలు పుట్టలేదు.. కోడలి లో లోపం ఉందని భావించిన అబ్బాయి పేరెంట్స్ అమ్మాయిని అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేశారు..



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నూజివీడు పరిధిలోని చాట్రాయి మండలం కొత్తగూడెంకి చెందిన సుధాకర్‌కి నూజివీడు పట్టణానికి చెందిన విజయశాంతి తో 2016లో వివాహమైంది. అతను భార్యతో కలిసి ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్ లో ఉన్నాడు. నాలుగేళ్లయినా పిల్లలు కలగడం లేదని పలు ఆస్పత్రులు తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కొత్తగూడెం వచ్చేశారు. అప్పటికే కోడలికి పిల్లలు పుట్టడం లేదని ఆగ్రహంతో ఉన్న అత్తమామలకు భర్త కూడా జత అయ్యాడు.



ఆమెకు నమ్మకంగా పాలల్లో నిద్ర మాత్రలు వేసి తాగించారు. గాఢ నిద్రలో ఉన్న ఆమెను ఊపిరి ఆడనివ్వకుండా అత్త మామలు ,భర్త చేశారు. ఆమె చనిపోయినట్టు చెప్పారు. బిపి ఉన్న సంగతి తెలుసుకున్న వాళ్ళు బిపి ఎక్కువ అవ్వడంతో ఆమె బాత్ రూమ్ లో కళ్లు తిరిగి పడిపోయిందని అందరినీ నమ్మించారు.. అమ్మాయి తల్లి దండ్రులు కు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్తింటి వారే కోడలిని హత్య చేసినట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేసి ఊసలు లెక్క పెట్టిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: