ఆడపిల్లలు 15 ఏళ్ల వయసునుంచే పిల్లల్ని కనగలుగుతారని అలాంటప్పుడు వారి వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకని ప్రశ్నించారు సజ్జన్ సింగ్ వర్మ.ఇది తాను చెబుతున్న మాట కాదని వైద్యుల నివేదిక ప్రకారం 15 ఏళ్ల వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా మారతారని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకోవడానికి తగినంత పరిణతి చెందుతారని అన్నారు. ఈ కారణంగానే ఆడపిల్లల వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారని ఆయన తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సజ్జన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాదు పార్టీ నుండి ఆయనను బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఒక్క మధ్యప్రదేశ్ అమ్మాయిలనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మాయిలను కించపరిచే విధంగా వర్మ మాట్లాడారని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. దేశ మహిళా లోకానికి వర్మ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లు కూడ మహిళలు అనే విషయాన్ని
విషయాన్ని వర్మ మర్చిపోయిఈ వ్యాఖ్యలు చేశారేమోనని రాహుల్ అన్నారు. మహిళలకు వర్మ బహిరంగ .క్షమాపణలు చెప్పాలని ఆయన సజ్జన్ సింగ్ వర్మను కోరారు. సజ్జన్ ను పార్టీ నుండి బహిష్కరించాలని రాహుల్
సోనియాను కోరారు.సమస్య లేకుండానే సమస్యను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా చెప్పారు....