15 ఏళ్ల పైబడిన కార్లు బైకులు అన్నింటినీ కూడా ఇక నుంచి చెత్త కింద పడేయాల్సిందే.. లేదా ఇనుప సామాన్ల వాడికి అమ్ముకోవాల్సిందే. ఇక ఇటీవల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని తెలియజేశారు. 15 సంవత్సరాల కంటే పైబడిన వాహనాల ద్వారా పెద్ద ఎత్తున ప్రస్తుతం వాయు కాలుష్యం జరుగుతుంది అన్న విషయాన్ని వెల్లడించారు ఆయన. దీంతో టెక్నాలజీకి అనుగుణంగా రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని. కాలుష్య రహిత మైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
మార్కెట్లోకి వస్తున్న కొత్త వాహనాలకు రూట్ క్లియర్ చేసేందుకు అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. ఒకవేళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు వస్తే ఎంతో మంది వాహనదారులకు భారీ షాక్ తగులుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎంతో మంది 15 సంవత్సరాల పైబడిన వాహనాలు నడుపుతూ ఉండడంతోపాటు.. కొంతమంది కొన్ని వాహనాలను ఎంతో సెంటిమెంట్ తో ఇప్పటికీ కూడా నడుపుతున్నారు అనే విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో చూడాలి మరి.