జగనన్న తోడు, అమ్మ వడి పథకాలతో పాటు కొత్త పథకాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు సీఎం జగన్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. మారుమూల పల్లెలకు కూడా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు.
                                        గ్రామాల్లో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద ఇంటర్నెట్‌ లైబ్రరీ.. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చెప్పారు. ఈ మేరకు తగు ఏర్పాట్లు సిద్ధం చేయాలని జగన్‌ ఆదేశించారు. విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం తెలిపారు. పల్లెల్లో అంతరాయాలు లేకుండా నెట్‌వర్క్‌ అందించాలని ఆయన సూచించారు. ఏ స్థాయి కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద ఇంటర్నెట్‌ లైబ్రరీ ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. తద్వారా ఉద్యోగులు సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం చేసుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని సీఎం జగన్‌ సూచించారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని జగన్ తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా ల్యాప్‌టాప్‌ చెడిపోయిందని గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతులు చేసి ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: