పంజాబ్ నుంచి వేలాదిగా ట్రాక్టర్లు ఢిల్లీ దిశగా వెళుతున్నాయి. అయితే రైతుల ట్రాక్టర్లకు డీజిల్ నిరాకరించాలని ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరింది. ఢిల్లీ దిశగా వెళ్లే ఏ ట్రాక్టర్కూ డీజిల్ అందివ్వరాదని అనేక పెట్రోల్ బంకులకు ప్రభుత్వాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయం రైతులకు తెలియడంతో చాలా చోట్ల బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. రాజ్పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తరువాతే అంటే ఉదయం 11-30 గంటల తరువాతే ట్రాక్టర్ ర్యాలీ ఆరంభం కావాలి. పోలీసుల షరతులకు రైతులు కూడా అంగీకరించి.. వాళ్ల రూట్ మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు.
రాజ్పథ్లో రిపబ్లిక్ డే ముగిశాకే.. రైతుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లోని బ్యారికేడ్లను తొలగిస్తారు. ట్రాక్ట ర్ ర్యాలీని మూడు సరిహద్దు పాయింట్ల నుంచి అంటే సింఘూ, టిక్రీ, గాజీపూర్ల వైపు నుంచి అనుమతిస్తా రు. పల్వాల్, షాజహాన్పూర్ అంటే రాజస్థాన్ వైపు నుంచి కూడా అనుమతించే అవకాశం ఉందని రైతు నాయకులు చెబుతున్నారు.
టిక్రీ నుంచి 63 కిమీ, సిం ఘూ నుంచి 60 కి.మీ, గాజీపూర్ నుంచి 46 కిలోమీటర్ల దూరం ర్యాలీని అనుమతిస్తారు. ఈ మూడూ కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రె్సవే వద్ద కలుస్తాయి. ఢిల్లీ నగరంలోనే 100 కి.మీ మేర ఇది సాగుతుంది.ఎన్ని ట్రాక్టర్లు ఏఏ పాయింట్ల నుంచి వస్తాయన్నది ముందుగానే నిర్ధారిస్తారు. ఢిల్లీ నగరంలో ఎక్కడికక్కడ అవుట్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ట్రాక్టర్లు ఆయా పాయింట్ల నుంచి మరలిపోవాలి.