హిందువుల వందల సంవత్సరాల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో నెరవేరబోతుంది అని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పార్టీలకతీతంగా 2023వరకు మందిర నిర్మాణం పూర్తవుతుంది అని ఆమె పేర్కొన్నారు. మందిర నిర్మాణంతో దేశం లో శాంతి నెలకొని, అభివృద్ధి జరిగి అగ్రరాజ్యాలకు పోటీగా దేశం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నా అని ఆమె విశ్వాసం వ్యక్తం చేసారు. తెరాస 7సంవత్సరాల పాలనలో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎకరాకు నీరు అందించలేదు అని మండిపడ్డారు.

అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పార్టీ మారినా ఇంకా ఇక్కడ వలసలు కొనసాగుతున్నాయి అని ఆమె మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కు సాగునీటి విషయం లో సీఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదు అని ఆమె అన్నారు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాత్రం సీఎం ను అడిగే ధైర్యం చేయటం లేదు అని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి నీరు రావని తెలిసిన ఎమ్మెల్యేలు కినుక్కు మనటం లేదు అని ఆమె పేర్కొన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ది కర్ణాటక నా, లేదా తెలంగాణ నా అర్థం కావడం లేదు అని అన్నారు.

ఆయన కేవలం ఇక్కడ రాజకీయంగా లబ్ది కోసం ఇక్కడున్నారు అని ఆమె మండిపడ్డారు. జిల్లా వచ్చిన నారాయణపేట ఇంకా అభివృద్ధి చెందలేదు అని ఆయన ఆరోపించారు. ఇక్కడకు వచ్చిన సైనిక స్కూల్ కు ,రైల్వే లైన్ కు మోక్ష మెప్పుడో అని ప్రశ్నించారు. కేవలం పాలమూరు ఎత్తిపోతల పథకం కు 0.40 టీఎంసి ల ద్వారా 12.50 లక్షల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో అర్థం అవటం లేదు అని అన్నారు. ప్రాజెక్టు కు భూ సేకరణ పూర్తి కాలేదు అని అన్నారు. కానీ సీఎం గారు ఈ సంవత్సరం లో ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్నారు అని ఆమె ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: