ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది తెలిసి తెలియని ఈ వయసులోనే ప్రేమలో పడడం చివరికి ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారో లేదో అనే అనుమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి ఎన్నో తెరమీదకు వస్తున్నాయి ఇక ఇటీవల సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగులోకి వచ్చిన ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. అయితే ప్రేమజంట ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుగుతుండగా ఎన్నో ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి.


 ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కోదాడ పట్టణ పరిధిలోని చేగొండి రామయ్య తిరుపతమ్మ దంపతుల చిన్న కొడుకు  ఇరవై ఏళ్ల మణికంఠ.. ఐటిఐ పూర్తి చేసి  స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి అదే కాలనీలో ఉండే ఫాతిమా అనే 16 ఏళ్ల యువతితో పరిచయం అయింది. వీరి మధ్య ప్రేమ చిగురించడం తో కొన్నాళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరచు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ఇక ఇటీవల ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తండ్రి  చూసి ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ మణికంఠ ను మందలించాడు.



 దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు మణికంఠ.  తర్వాత రోజు నుంచే ఇంట్లో కనిపించకుండా పోయాడు అదే సమయంలో ఫాతిమాకూడా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే కోదాడ చెరువు వద్ద యాసిడ్ బాటిల్, చెప్పులు రెండు గ్లాసులు కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు గజ  ఈత గాళ్ళ సాయంతో  చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: