పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాంపల్లి సత్యనారాయణ కాలనీకి చెందిన శ్యామల లింగస్వామి అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసగా మారి తరుచు ఇతరులతో గొడవలు పడేవాడు. దీంతో అతని తల్లిదండ్రులు వేరే చోటుకు వెళ్లి నివాసం ఉంటున్నారు. అయితే ఫిబ్రవరి 26న మద్యం మత్తులో లింగస్వామి వీరంగం సృష్టించాడు. అంబేడ్కర్నగర్కు చెందిన నిఖిత ఠాగూర్ అనే మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భర్త ముందే ఈ చర్యకు పాల్పడ్డాడు
దీంతో అక్కడిని చేరుకున్న చుట్టుపక్కల వారు అతడిని మందలించారు. అటువైపు రావద్దంటూ హెచ్చరించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి నిఖిత సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లింగుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి నోటీసు జారీచేసి వదిలేశారు.
అయితే లింగుస్వామి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిఖిత కుటుంబ సభ్యులు.. చర్లపల్లిలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద అతడు ఉండటం గమనించారు. మాట్లాడుకుందామని చెప్పి అతడిని కారులో ఎక్కించి.. దాడి చేశారు. ఓ పాస్ట్ పుడ్ సెంటర్కు చెందిన గదిలో తాళ్లతో బంధించి దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా వీడియో తీశారు. ఈ దాడిలో నిఖిత భర్తతో పాటుగా, సోదరుడు, అతని ఇద్దరు ఫ్రెండ్స్ పాల్గొన్నారు. దీంతో అసలు విషయం తెలుసుకన్న లింగుస్వామి తల్లి.. ఆ నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు.