పాపాలు చేశారు అని బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసి ఉంటారు అనే చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ అభిమానులు కార్యకర్తలు మాత్రం బండ్ల గణేష్ ని టార్గెట్ చేశారు. భజన మరీ ఎక్కువైంది విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ పేరు మారుమోగిపోయింది విషయం అందరికి తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఆయన తమ పార్టీ గెలవకుంటే గొంతుకోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ విజయం సాధించడంతో ఆయనపై బీభత్సమైన ట్రోల్ల్స్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ట్రోలింగ్ తర్వాత తాను ఏ పార్టీలో లేనని బండ్ల గణేష్ పదేపదే చెప్పారు. ఇకపై సినిమాలు వ్యాపారాలు చూసుకుంటాను అని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించిన ఆయన పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఎవరు లేరు నీకెవ్వరు సినిమా ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మళ్లీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.