ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నేతలను తీవ్రంగా విమర్శించిన మంత్రి ఈటల.. బీజేపీ సోషల్ మీడియాలో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోందని చెప్పుకొచ్చారు. అది మంచి సంప్రదాయం కాదని అన్న మంత్రి ఈటల తాత్కాలిక విజయాల కోసం.. తాత్కాలికమైన ప్రయోజనం కోసం సంప్రదాయాలను, గౌరవాలను ఫణంగా పెట్టే పరిస్థితి రావద్దని కడియం శ్రీహరి లాంటి వాళ్లు ఎక్కువగా కోరుకుంటారని.. తాను కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు.
రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా సమాజ శ్రేయస్సు కోసమే పని చేస్తారని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసమో లేక.. సొంత ప్రయోజనాల కోసమో రాజకీయ నాయకులు ఆశించరని.. కానీ ప్రస్తుతం అట్లా చిత్రీకరించేటటువంటి పరిస్థితి వచ్చిందని మానవ సంబంధాల్లోనే కాకుండా, రాజకీయ నాయకులు.. ప్రజల మధ్య ఉండే సంబంధాల్లో చోటుచేసుకుంటున్న బాధాకరమైన సన్నివేశాల్ని ఇవ్వాళ మనం చూస్తున్నామని ఆయన అన్నారు. ఏదో ఒక రోజు పెరుగుట విరుగుట కోసమే అన్నట్టుగా ఇట్లాంటివన్నీ పెరుగుతాయి.. మళ్లీ ఎక్కడో తప్పకుండా విరుగుతాయనే నమ్మకం తనకు ఉందని మంత్రి ఈటల ధీమా వ్యక్తం చేశారు. అంతిమంగా రాజకీయాలు, రాజకీయ నాయకుల పట్ల గౌరవం పెరిగేలా ప్రజలను మనం డ్రైవ్ చేయాలని మంత్రి ఈటల అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి