దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారినపడి ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక దేశంలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇక కొంతమంది కరోనాని జయించిన ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత రెటీనా వ్యాస్కులర్ బ్లాక్ అంటే కంటి రక్త నాళాల్లో అడ్డంకి ఏర్పడటం వంటి సమస్య ఎదురవుతోందని ఆరోగ్య నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే కరోనా సోకిన వారిలో వెంటనే ఈ రోగ లక్షణాలు ఉండవని అంటున్నారు. కానీ, రోగి కోలుకున్న నెల రోజుల తర్వాత కంటి చూపు మసకబారడం వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి అని ఆయన చెప్పారు. కరోనాను జయించిన ఆనందం నిలువలేదు. బాహ్య ప్రపంచాన్ని వారు ఇక చూడలేరు. ఎందుకంటే వారు కంటిచూపును కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా.. శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కరోనాని జయించి కంటిచూపు పోగొట్టుకున్న ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో 8 మంది వ్యక్తులు కరోనాని జయించారు. కానీ వారికీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కరోనాని జయించిన ఆ ఎనిమిది మంది  కంటి చూపు కోల్పోయారు.వీరిని వైద్య నిపుణులు పరిశీలించారు. మ్మూకోర్మిసిస్ అనే బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి చూపును కోల్పోయారని వారు వెల్లడించారు.

ఇరాక్ ఈ ఫంగస్ అత్యంత ప్రమాదకరమని, ప్రాణాలను సైతం హరించి వేస్తుందని హెచ్చరించారు. ఇక కరోనా చికిత్సకు వాడే మందుల వల్ల..బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా…భారతదేశంలో 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారని నివేదికలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: