మనలో చాలా మంది తమ కోసమే బతుకుతుంటారు. ఇంకొందరు పక్కవారి సంతోషం కోసం ఉంటారు. అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఓ వైద్యుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి 270 మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలోని జలగావ్‌లోని ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ నెల 13న ఏడున్నర గంటల సమయంలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకు ఖాళీకావచ్చింది. అప్పటికి ఆసుపత్రిలో దాదాపు 270 మంది రోగులు ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ సందీప్ బృందం ట్యాంకర్ ఖాళీ అవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు 100 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడింది.

ఇందుకోసం వారు దాదాపు 8 గంటలుగా శ్రమించారు. నిజానికి ఆ రోజు సందీప్ బర్త్ డే. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నా విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడు.  ట్యాంకర్ ఖాళీ అవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడటం పలువురిని ఆకర్షించింది. పుట్టిన రోజు కావడం వల్ల సందీప్ కు తమ ఇంటి నుంచి తెగ ఫోన్లు వస్తున్నా లెక్క చేయలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా తాను పనిలో బిజీగా ఉన్నా డిస్ట్రబ్ చేయొద్దు అని సున్నితంగా చెప్పారు. దాదాపు 8 గంటల పాటు సందీప్ బృందం శ్రమించి విజయం సాధించడం గొప్ప విషయం. విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడంతో సందీప్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటి వారు ఉండటం వల్లే ఈ రోజు చాలా మంది కరోనాను జయిస్తున్నారనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: