హుజురాబాద్ రాజకీయమంతా తెలంగాణలో  హాట్ టాపిక్ గా మారింది. అక్కడ విజయం సాధించడం కోసం ప్రతి నేత తమదైన శైలిలో ముందుకు పోతున్నారు. టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను, బీజేపీని ఎదురుకొనే బలమైన అభ్యర్థి కోసం ఆచితూచి అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా సర్వేలు చేయించుకొని డేటాలు తెప్పించు కున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఆయన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆచితూచి  అక్కడ అభ్యర్థిని బరిలో దింపాలని హుజురాబాద్ నియోజకవర్గాన్ని సాధించాలని చూస్తున్నారు.

ఇంకా అభ్యర్థిని ప్రకటించకుండా ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ శాశ్వత రాజీనామా ఇచ్చి బిగ్ షాక్ ఇచ్చారు. తర్వాత ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పై అవాకులు, చెవాకులు చేశారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టాలని టిఆర్ఎస్ ను, బీజేపీని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తోంది. దీనికోసం ముందుగా పొన్నం ప్రభాకర్ ను ఎంపిక చేసింది. కానీ ఆయన విముఖత చూపడంతో మళ్లీ అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కొంతమంది పేర్లతో జాబితా తయారు చేసింది. వీరిలో ఎవరో ఒకరు హుజురాబాద్ లో పోటీ చేస్తారని సమాచారం.

 సిరిసిళ్ల పట్టణానికి చెందిన కెకె మహేందర్ రెడ్డి, ఇటీవల ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో చేరి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం, అంతేకాకుండా సీనియర్ జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తారు అనేది సమాచారం. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత  ఇది మొదటి ఎన్నిక కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా విజయం అనేది కీలకం. కాబట్టి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ తీవ్రమైన సన్నాహాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: