ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు సుఖ్జిత్సింగ్ రంధావా. డేరాబాబా నానక్ స్థానం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నాడు ఆయన. మాజీ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో జైళ్లు, సహకారా శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. అయితే తనే సీఎం గా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపిన రంధావా గవర్నర్ అపాయింట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారంతో మరింత ఆసక్తి నెలకొంది.
అయితే, పంజాబ్ కాంగ్రెస్లో కొనసాగుతున్న అధికార పోరు మధ్య, కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాను గవర్నర్కు సమర్పించిన తర్వాత విలేకరులతో మాట్లాడిన అమరీందర్ సింగ్, పార్టీ హైకమాండ్ చర్యల ఫలితంగా తాను 'అవమానానికి గురయ్యాను' అని ఆవేదన చెందాడు.