2013 సంవత్సరం నాటి ఆడిట్ ప్రకారం చూస్తే.. ట్రస్టు దగ్గర రూ. 2.87 కోట్లు నగదు, రూ. 1.95 కోట్లు విలువజేసే ఆస్తులున్నట్టు ఆలయ పరిపాలన కమిటీ న్యాయవాది తెలిపారు. ఆలయ ఆస్తులన్నీ ఎంత వరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికే ఆడిట్ జరగాల్సిన అవసరముందని వాదించారు. కాగా, ఈ వాదనలను ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు నిర్వహిస్తున్న ట్రస్ట్ తరఫు లాయర్ తోసిపుచ్చారు. ఆలయ పరిపాలన తోపాటు రోజువారీ వ్యవహారాలతో ట్రస్ట్కు సంబంధం లేదనీ, అందులో ట్రస్ట్ పాత్ర కూడా లేదని అన్నారు. రాజకుటుంబీకులు తమకు సంబంధం కలిగిన పూజలను మాత్రమే పర్యవేక్షిస్తారని చెప్పారు. ట్రస్ట్కు ఆలయంతో సంబంధం లేదని వాదించారు. అలాగే ఆడిట్ చేయించాల్సిన పనిలేదని కూడా చెప్పారు. అసలు ట్రావెన్కోర్ ట్రస్ట్ వ్యవహారాల్లో ఆలయ కమిటీ జోక్యానికి, పర్యవేక్షణకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలపై పాతిక ఏళ్ల ఆడిట్ను నిర్వహించాలని గతేడాది జారీచేసిన ఉత్తర్వులనుంచి ట్రస్ట్ను మినహాయించాలని కోరారు.
2013 సంవత్సరం నాటి ఆడిట్ ప్రకారం చూస్తే.. ట్రస్టు దగ్గర రూ. 2.87 కోట్లు నగదు, రూ. 1.95 కోట్లు విలువజేసే ఆస్తులున్నట్టు ఆలయ పరిపాలన కమిటీ న్యాయవాది తెలిపారు. ఆలయ ఆస్తులన్నీ ఎంత వరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికే ఆడిట్ జరగాల్సిన అవసరముందని వాదించారు. కాగా, ఈ వాదనలను ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు నిర్వహిస్తున్న ట్రస్ట్ తరఫు లాయర్ తోసిపుచ్చారు. ఆలయ పరిపాలన తోపాటు రోజువారీ వ్యవహారాలతో ట్రస్ట్కు సంబంధం లేదనీ, అందులో ట్రస్ట్ పాత్ర కూడా లేదని అన్నారు. రాజకుటుంబీకులు తమకు సంబంధం కలిగిన పూజలను మాత్రమే పర్యవేక్షిస్తారని చెప్పారు. ట్రస్ట్కు ఆలయంతో సంబంధం లేదని వాదించారు. అలాగే ఆడిట్ చేయించాల్సిన పనిలేదని కూడా చెప్పారు. అసలు ట్రావెన్కోర్ ట్రస్ట్ వ్యవహారాల్లో ఆలయ కమిటీ జోక్యానికి, పర్యవేక్షణకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలపై పాతిక ఏళ్ల ఆడిట్ను నిర్వహించాలని గతేడాది జారీచేసిన ఉత్తర్వులనుంచి ట్రస్ట్ను మినహాయించాలని కోరారు.