డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే గత వారం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖ వచ్చింది. ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నిధులను వేరే పథకాలకు మళ్లించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రూ.960కోట్లకు లెక్కలు చెప్పకపోతే భవిష్యత్తులో నిధులు విడుదల చేయబోమని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తేల్చి చెప్పాయి.
ఈ ప్రాజెక్టుల కింద చేపట్టిన పనులకు తమకు బిల్లులు ఇవ్వడం లేదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారట. ఆ మాటకు వస్తే ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పనులు చేపట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక కాంట్రాక్టర్ల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ఆర్తిక శాఖ వారం రోజుల్లో వివరణ కావాలని ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసింది.