2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని ఆయన అన్నారు. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అని ఆయన మీడియాకు వివరించారు. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో తాజ్వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్... జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని అన్నారు ఆయన. వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఏపీ మంత్రి తెలిపారు. అగ్ర వర్ణాల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది అని అంటున్నారు. వైద్య అలాగే విద్య విషయంలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్ణయం తీసుకున్నామని అన్నారు.