మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ వివక్షకు గురైన రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక అన్ని ప్రాంతాలలో కూడా రహదారుల అభివృద్ధి చేయడం విద్య ఉద్యోగం లాంటివి కూడా పెంచుతూ యువతకు ఉపాధి కల్పించడం లాంటివి చేస్తూ ఉన్నాయ్. అంతే కాదు ఇక ఈశాన్య రాష్ట్రాలలో ఎంతో మందికి సురక్షితమైన మంచినీరు కూడా అందిస్తూ ఉండటం గమనార్హం.
ఇక ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే శాఖ ఒక అద్భుతమైన ప్రాజెక్టు మొదలు పెట్టింది అని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను కలిపే టువంటి ఒక రైల్వే లైన్ వేస్తుంది భారత రైల్వే శాఖ. మణిపూర్ లోని నోనీ వాలీ లో 141 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి నిర్మిస్తుంది భారత రైల్వే శాఖ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించబడుతున్న రైల్వే బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. రైల్వే మార్గం పూర్తయితే 10 గంటలలో చేసే ప్రయాణం కేవలం రెండు గంటల్లో చేసే అవకాశం ఉందట. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కీలకంగా మారబోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.