అలా అని టీడీపీ బలం పెరగడం వల్ల వైసీపీ బలం తగ్గడం కాదు...సొంత పార్టీ నేతల వల్లే వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అనే టాపిక్ అసలు కనిపించడం లేదు. ఎంతసేపు వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లే ఉంది. ఇక్కడ మొదట నుంచి ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే.
రోజాకు యాంటీగా ఉన్న గ్రూప్ తమదైన శైలిలో రాజకీయం చేస్తూ నగరిలో రోజాని సైడ్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య స్థానిక ఎన్నికల్లోనే రోజాకు చెక్ పెట్టాలని వ్యతిరేకవర్గం పావులు కదిపింది. కానీ రోజా...మంత్రి పెద్దిరెడ్డికి చెప్పి వ్యవహారాన్ని చక్కబెట్టారు. అయినా సరే ఈ గ్రూపు రాజకీయాలు ఆగడంలేదు. తాజాగా జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా ప్రత్యర్ధి వర్గీయులు ఫ్లెక్షీలు కట్టించారు. అయితే రాత్రికి రాత్రే వాటిని కొందరు చింపేశారు. ఇదంతా రోజా వర్గం వారే చేశారని ఆరోపిస్తున్నారు.