
ఈ వీడియో మొదట సోషల్ మీడియాలో షేర్ అయ్యి, క్షణాల్లోనే వైరల్ అయింది. మొదట ఎవరో సామాన్య వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేయడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ వీడియోను బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ స్థాయి నాయకుడు ఒక వీడియోను షేర్ చేయడంతో అది ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది.దీంతో ప్రజల్లో, మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది — “మనోజ్ బాజ్పేయి నిజంగానే ఆర్జేడీకి మద్దతు ఇస్తున్నారా?” అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో “తేజస్వీ యాదవ్ ఇంత పెద్ద వీడియో షేర్ చేసే ముందు కనీసం నిజమా కాదా అని చెక్ చేయలేదా?” అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై చివరికి స్వయంగా మనోజ్ బాజ్పేయి స్పందించారు. ఆయన ఒక పోస్ట్ చేస్తూ స్పష్టంగా తెలిపారు —“ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నేను కాదు. అది పూర్తిగా నకిలీ వీడియో. ఎవరో దురుద్దేశంతో, ప్రజలను మోసం చేసే ఉద్దేశ్యంతో సృష్టించారు. నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకండి."అంటూ ఒక స్పష్టమైన పోస్ట్ చేశారు . ఈ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో ఆగకుండా షేర్ అవుతూనే ఉంది. కొంతమంది తేజస్వీ యాదవ్పై విమర్శలు గుప్పిస్తున్నారు — “ఇంత పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా షేర్ చేయడం ఎలా?” అని ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ ఘటనతో మరోసారి ఫేక్ వీడియోల ప్రమాదం ఎంత పెద్దదో స్పష్టమవుతోంది.