అయినా కూడా బండి సంజయ్ ఆ పేరును మార్చాలని ఎందుకనుకున్నారు అనేది అందరికీ ప్రశ్న. ఆయన ఈ ప్రకటనతో మతపరమైన భావోద్వేగాలను రేకెత్తించి, హిందూ ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశ్యం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “హిందువుల ఐక్యత” గురించి తరచూ మాట్లాడే బండి సంజయ్, ఈసారి కూడా అదే లైన్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన ముస్లిం టోపీ, మదర్సా విద్య, ఇతర మతాల చిహ్నాలపై చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదాలకే కారణమయ్యాయి. బీజేపీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ముస్లిం పేర్లతో ఉన్న పట్టణాల పేర్లు మార్చే పాలసీని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. యూపీలో అలీగఢ్ ను హరిక్షేత్రం, అల్లాహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చారు. అయితే, తెలంగాణలో అటువంటి పాలసీని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ, బండి సంజయ్ తరచూ కరీంనగర్, హైదరాబాద్ వంటి నగరాల పేర్ల మార్పుపై కూడా సూచనలు చేశారు.
జూబ్లిహిల్స్ పేరు మార్చడం ప్రజల మన్నన పొందే నిర్ణయం కానే కాదు. ఈ ప్రాంతం హైదరాబాద్లో అత్యంత ప్రెస్టీజియస్ జోన్గా గుర్తింపు పొందింది. రియల్ ఎస్టేట్, సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి ఆ పేరే బ్రాండ్గా మారింది. అలాంటి పేరును మార్చేయడం ప్రజలకు నచ్చే విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద, బండి సంజయ్ చేసిన “జూబ్లిహిల్స్ను సీతారాంపురంగా మార్చేస్తాం” అన్న వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వేదికపై కొత్త చర్చకు తెరలేపింది. ఇది బీజేపీకి ప్లస్ అవుతుందా లేక రివర్స్ అవుతుందా అన్నది మాత్రం వచ్చే రోజుల్లో స్పష్టమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి