ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  వంగవీటి రంగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పొలిటికల్ పరంగా, కాపు సామాజిక వర్గంలో కీలకంగా ఉన్నారు. తాజాగా వంగవీటి ఫ్యామిలీలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.. రంగా ఫ్యామిలీ నుంచి మరొకరు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తోంది. రంగా కుమార్తె ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంగవీటి రంగా 21వ జయంతి విజయవాడలో బందరు రోడ్డులో రంగా విగ్రహానికి ఆయన కుమార్తె ఆశా కిరణ్ నివాళులు అర్పించారు.


అనంతరం ఆశా కిరణ్ మాట్లాడుతూ పాలకొల్లులో వనభోజనాలకు వెళ్తున్నామని ప్రస్తుతానికి రాజకీయ రంగ ప్రవేశం పైన ఎలాంటి ప్రకటన చేయదలుచుకోలేదని రాజకీయాలలోకి వచ్చే విషయం, ప్రకటనపై మరొకసారి మాట్లాడతానంటూ ఆశా కిరణ్ తెలియజేశారు. రాధా రంగా మిత్రమండలి ఆహ్వానం మేరకే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని, రంగా ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారని తెలియజేసింది. కుటుంబ బాధ్యతలు ఇతర కారణాలవల్ల కొన్నేళ్లపాటు తాను ప్రజలకి  దూరంగానే ఉన్నాను. కానీ ఇక మీదట పూర్తిగా నా ప్రయాణం ప్రజలతోనే ఉంటుందంటూ తెలియజేసింది.


ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సరే తాను కూడా తన తండ్రిలాగే అండగా ఉంటానంటూ తెలియజేసింది ఆశాకిరణ్. రాధా రంగా మిత్రమండలిలో అందరిని ఒకే తాటికి తీసుకురావడం కోసమే తాను బయటికి వచ్చానని, ఇంకా తాను ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం పైన సరైన నిర్ణయం తీసుకోలేదని నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తానని తెలిపింది. మా ఇద్దరి బాటలు వేరైనప్పటికీ ఆశయం మాత్రం ఒక్కటేనని .. ఇకమీదట రంగా అభిమానులతో కలుస్తూ ఉంటానని, రాధా రంగా మిత్రమండలిలో గ్యాప్  ఉన్నది ,ఆ గ్యాప్ లేకుండా కృషి చేస్తానంటూ తెలిపింది ఆశాకిరణ్. రంగా అంటే కాపు కులం మాత్రమే కాదు, అన్ని కులాల వారికి చెందినవారు .. నేను కూడా అంతేనంటూ తెలియజేసింది ఆశా కిరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: