అన్నదమ్ములుగా టీమిండియా క్రికెట్ జట్టులో రాణిస్తున్న హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలకు పితృవియోగం కలిగింది.  వారి తండ్రి హిమాన్షు పాండ్యా  గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఇద్దరు హుటాహుటిన వడోదర కు బయలుదేరారు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్‌ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్‌ వెంటనే వడోదర చేరుకున్నాడు. తన తండ్రి మరణంతో తో హార్థిక్ పాండ్యా చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి లేడనే వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ తన హృదయ ఆవేదన ను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

తన తండ్రితో గడిపిన మధురమైన క్షణాల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "నాన్నా.. నువ్వు ఇక లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మీరు వదిలి వెళ్లిన ఎన్నో మధుర జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, మీ నవ్వును మళ్లీ చూడలేమనే వార్త నన్ను ఎంతో బాధిస్తుంది. అన్నయ్య, నేను ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మీరే. మీరు ఉన్నతమైన నా వ్యక్తి.. మీ కష్టం, మీపై మీకున్న నమ్మకం మీ కలల్ని నిజం చేసింది. మీరు లేని ఇల్లు కళ తప్పి మేము ఒంటరి వాళ్ళం అయ్యామని గుర్తు చేస్తుంది..

మీరు ఎక్కడున్నా మమ్మల్ని కనిపెడుతూనే ఉంటారని ఆశిస్తున్నా. మమ్మల్ని చూసి మీరు గర్వపడ్డారు. కానీ, మీ ఆదర్శవంతమైన జీవన ప్రయాణం చూసి మేమంతా గర్విస్తున్నాం. నాన్న నా మీరే నాకు హీరో.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా కింగ్‌. ప్రతిరోజు ప్రతి గడియా మిమ్మల్ని మిస్‌ అవుతున్నాను.. లవ్‌ యూ డాడీ అంటూ పాండ్యా పేర్కొన్నాడు. హార్థిక్ పాండ్యా తండ్రికి శాంతి చేకూరాలని పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: