బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్టు ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ లో బరిలోకి దిగుతూ ఉంటుంది. ఈ జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా టైటిల్ గెలవలేదు ఆర్సీబీ జట్టు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులందరికీ కూడా వరుస షాకులు తగులుతున్నాయి.



 ఆర్ సి బి  జట్టు మొదలైన నాటి నుంచి ఈ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆర్ సి బి అంటే విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ అంటే ఆర్ సి బి జట్టు అన్న విధంగా మారిపోయింది. అలాంటి విరాట్ కోహ్లీ ఇక తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ చెప్పి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. అయితే ఇక కోహ్లీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అభిమానులకు కాస్త సమయం పట్టింది. కానీ అంతలోనే మరో షాక్ తగిలింది. కోహ్లీ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ముందుండి నడిపిస్తాడు అనుకున్న ఎబి డివిలియర్స్ పూర్తిగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.


 దీంతోఎబి డివిలియర్స్ లాంటి ఒక కీలక ఆటగాడు దూరమయ్యాడు అన్నది ఒక వైపు.. కెప్టెన్ అవుతాడు అనుకుంటే ఇలాంటి షాక్ ఇచ్చాడు ఏంటి అన్నది మరోవైపు అభిమానులను అయోమయంలో పడేసింది.  ఇలా ఎబి డివిలియర్స్ రిటైర్మెంట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోయే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.. ఐపీఎల్ వచ్చే సీజన్ నుంచి ఎబి డివిలియర్స్ ఆర్సిబి జట్టు బ్యాటింగ్ కోచ్ గా ఉండబోతున్నాడట.ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇంటర్వ్యూలో ఇండైరెక్టుగా ఈ విషయం చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.. అయితే అటు కోహ్లీతో ఎబి డివిలియర్స్ కి మంచి అనుబంధం ఉంది. దీంతో ఇది నిజమే అని నమ్ముతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl