ఎన్నో రోజుల నుంచి టీమిండియా కెప్టెన్సీ మార్పుపై డిమాండ్లు వచ్చాయి. ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలిపించిన రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్గా నియమించాలి అంటూ డిమాండ్లు వచ్చాయి.కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా కు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందించలేకపోయాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. బీసీసీఐ  కెప్టెన్సీ మార్పు చేసే అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పింది. కానీ అలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా మారడం అనివార్యంగా మారిపోయింది.


 టి20 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు.. దీంతో టీమ్ ఇండియా టి20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ నియమించింది బీసీసీఐ. అయితే ఆతర్వాత వన్డే ఫార్మాట్ కు రోహిత్ శర్మకు కెప్టెన్ నియమిస్తారూ అన్నదానిపై చర్చ మొదలయింది. దీంతో టీ20, వన్డే లాంటి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా నియమించి ఇక టెస్టు ఫార్మాట్లో విరాట్ కోహ్లీని కెప్టెన్ కొనసాగించేఅవకాశం ఉందని భావించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 కెప్టెన్గా  కొనసాగుతున్న రోహిత్ కు మరి కొన్ని రోజుల్లో వన్డే కెప్టెన్ గా కూడా ప్రమోషన్ రాబోతుందని అనుకున్నారు.



 కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రమోషన్ కాస్త క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు మరింత సమయం పట్టవచ్చని ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌత్ ఆఫ్రికా కు వెళ్లే భారత జట్టును ప్రకటించిన సమయంలో రోహిత్ ను కొత్త కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటన చేస్తుందని అందరూ భావించినప్పటికీ... సౌతాఫ్రికా పర్యటనలో వన్డేలకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగించాలని భావిస్తున్నట్టున్నారట. ఇక ఆ తర్వాతె వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉందని ప్రస్తుతం కొత్త టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: