గత ఏడాది డిసెంబర్ 31 తేదీన భారత క్రికెట్ అభిమానులందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. కారణం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం పారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని తన ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో రూర్కి సమీపంలో అతని కారు చివరికి ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది అని చెప్పాలి. అదృష్టవశాత్తు కారులోంచి దూకిన పంత్ మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.


 ఈ క్రమంలోనే ముంబైలోని కోకిల బెన్ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వైద్య బృందం సమక్షంలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అతని మోకాలికి శస్త్ర చికిత్స జరిగినట్లు కూడా తెలుస్తోంది.  అయితే ఇక అతను త్వరగా కోలుకుంటున్నాడు అని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో అటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ఇటీవల రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి అటు వైద్యులు అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వారంలో రిషబ్ పంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయంపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది.


 రిషబ్ పంత్ వేగంగా కోరుకుంటున్నాడు. ఇక ఇటీవల వైద్య బృందం కూడా శుభవార్త చెప్పింది. రిషబ్ పంత్ మొదటి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. మరో వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు తెలిపారు అంటూ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయినప్పటికీ మళ్ళీ వచ్చే నెలలో వంత్ హాస్పిటల్కు వెళ్లాల్సి ఉందట. ఎందుకంటే అతనికి మరో సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇక మరో నెలలో ఆ సర్జరీని చేయబోతున్నారట వైద్యులు. ఎప్పుడు చేస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే బీసీసీఐ వైద్య బృందం మాత్రం అటు కోకిల బెన్ ఆస్పత్రి వైద్యులతో నిరంతరం టచ్ లో ఉంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: