ఇండియాలో 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది. ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం ఇటీవల ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఆక్షన్ లో ఎంతోమంది ప్లేయర్లు రికార్డు స్థాయి ధర పలికారు అని చెప్పాలి. ముఖ్యంగా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉండి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు పెద్దపీట వేసాయి. దీంతో ఆయా ఆటగాళ్ళను కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకడుగు వేయలేదు. దీంతో ఆస్ట్రేలియా టైటిల్ గెలిపించిన కెప్టెన్గా ఉన్న ప్యాట్ కమిన్స్ ను 20.5 కోట్లకు సన్రైజర్స్ దక్కించుకుంది.


 ఇదే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర అని అనుకుంటున్న సమయంలో ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోల్కతా నైట్ రైడర్స్ మిగతా టీమ్స్ తో పోటీపడి మరి 24.75 కోట్లకు దక్కించుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు కూడా ఈ రేంజ్ లో భారీ ధర పలకలేదు. దీంతో విదేశీ ప్లేయర్లకే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే వేలంలో పాల్గొన్న పలువురు టీమిండియా ప్లేయర్లకు ఎక్కువ ధర పెట్టేందుకు ఆయా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇక ఇదే విషయం గురించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు.



 ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లకు దక్కిన భారీ ధర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకవేళ విరాట్ కోహ్లీ ఐపిఎల్ వేలంలో పాల్గొంటే అతని దక్కించుకునేందుకు ప్రాంచైజీలు 42 నుంచి 45 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా 2008 ఐపీఎల్ ప్రారంభం సీజన్ నుంచి కూడా కోహ్లీ ఆర్సిబి తరపున ఆడుతున్నాడు. ఇక అప్పటి నుంచి ఒక్కసారి కూడా అతను వేలంలో పాల్గొనలేదు అని చెప్పాలి. అయితే రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్లు ఒకవేళ వేలంలోకి వస్తే వారిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎంత మొత్తంలో ధర పెడతాయో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: