డబ్బులు డ్రా చేసుకోవాలి అంటే.. సదరు బ్యాంక్ ఏటిఎం లలో మాత్రమే యూజర్లు డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎంలలో కార్డు లేకుండా చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని ఏటీఎం తయారీ సంస్థలు అయినటువంటి ఎంసీఆర్ కార్పొరేషన్.. వినియోగదారుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని, సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. టెక్నాలజీ సహాయంతో మీరు ఎటువంటి ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయవచ్చు.
ముఖ్యంగా మీరు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకోవాలంటే యూపీఐ యాప్ కంపల్సరి గా ఉండాలి. యూపీఐ యాప్ సహాయంతో మీరు యూపీఐ ఆప్ ను ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఇందుకోసం ఏటీఎంలో క్యూఆర్ కోడ్ ను మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ కోడ్ స్కానింగ్ చేసి అవసరమైన అమౌంటు ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ విధానం ద్వారా కేవలం ఐదు వేల రూపాయల వరకు మాత్రమే విత్డ్రా చేసుకోగలరు.కాబట్టి ఇకమీదట మీరు ఏటీఎమ్ లకు వెళ్తే మొబైల్ లో వుండే యుపీఐ యాప్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.