ప్రస్తుతంకాలంలో బైక్ అనేది అతి సాధారణం. అందరి దగ్గర ఇప్పుడు బైకులు ఉండనే ఉంటాయి. బైకు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు అమాంతం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు పెట్రోల్ కొట్టించుకోలేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  ఎలక్ట్రిక్  వాహనాల హావా చెలరేగిపోతోంది.

ఇక ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు కంపెనీ శ్రీవారు మోటార్స్ లాంచ్ చేసిన 'ప్రాణా 'ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. కుర్రాళ్ళను ఆకట్టుకునే విధంగా స్టైలిష్ లుక్ తో ఇది మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ వెహికల్ మైలేజ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏకంగా 225 కిలోమీటర్ల వరకు వెల్లవచట.


ఈ  ప్రాణ వెహికల్ కి చార్జింగ్  చేయటానికి  కేవలం 4 గంటల 15 నిమిషాలు సమయం  పడుతుందట. అంతేకాకుండా నాలుగు సెకండ్లలో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. గరిష్టంగా ఈ బైకు గంటకు 120 మూడు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. నిథిన్ అయాన్ బ్యాటరీల ను వినియోగించి, బ్యాటరీ ని రెండు వేల సార్లు ఛార్జ్ చేసుకోవచ్చని.. కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ బైకు మూడు వేరియంట్లలో లభిస్తుందట. గ్రాండ్ వేరియంట్ ధర  రూ.1,99,999. ఎలైట్ బైక్ ధర  రూ.2,74,999. ఇవి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ధరలే. క్లాస్ మోడల్ ధరను ఇంకా ప్రకటించలేదు. అంతేకాకుండా ఈ బైక్ వల్ల పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చట .

ముఖ్య గమనిక :
శ్రీవారి మోటార్స కంపెనీ వారు ప్రకటించింది ఏమిటంటే..ఏదైనా  ఒక ప్రదేశంలో   పది మొక్కలు నాటితే రూ.25,000 రూపాయలను డిస్కౌంట్ గా కూడా ఇస్తారట. ఈ బైక్ ను బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్సైట్లో రూ.1,999 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైక్ బుక్ చేసిన అనంతరం 45  రోజుల్లో బైక్ డోర్ డెలివరీ చేయబడుతుంది. ఈ బైకు వచ్చే ఏడాది లోపల అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: