ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేక్ సర్టిఫికెట్ లు పెట్టి ఉద్యోగాలు పొందుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయాలు బయటపడే అంతవరకు పెద్దగా ఎవరూ పట్టించుకోరు.. అయితే తాజాగా ఇప్పుడు హైదరాబాదులో ఉండి ఉస్మానియా విద్యాలయం లో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటికి రావడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. ఈ రోజున ఓయు విద్యార్థుల నాయకులు హైదరాబాదులో cp కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ లో నకిలీ సర్టిఫికెట్ లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగిందట.

అయితే అందుకు సంబంధించిన విషయాలను కూడా ఏపీకి వివరించినట్లు సమాచారం. అయితే ఇది నకిలీ సర్టిఫికెట్ అన్న వ్యవహారంపై ఉస్మానియా అధికారులు ధ్రువీకరించి నట్లు తెలుస్తోంది. కన్సల్టేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మీ అండగా చేసుకొని ఇలాంటి దందా కొనసాగుతున్న వారిపై విద్యార్థి నాయకులు cp కీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ ఫిర్యాదుకు తగిన ఆధారాలను కూడా సేకరించి విద్యార్థి నేతలు ఆ అధికారికి అందజేశారు. ఇలా వీరే కాకుండా ఎంతో మంది కూడా నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి ని విచారణ జరపాలని ఆ విద్యార్థి నాయకులు కోరడం జరిగిందట.

పలువురు దొంగ సర్టిఫికెట్ లతో విదేశాలకు వెళ్లారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.. ఈ వ్యవహారం లో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అని విచారించి వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని ఆ విద్యార్థి నాయకులు విజ్ఞప్తి చేయడం జరిగింది. విద్యార్థి నాయకుల సంఘాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం కూడా జరిగింది.. దీంతో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఇక అంతే కాకుండా ముద్దం స్వామిని కూడా కేవలం వారం రోజుల లోపల అదుపులోకి తీసుకుంటామని హైదరాబాద్ సీపీ హామీ ఇవ్వడంతో విద్యార్థి నాయకులు కాస్త కుదుట పడ్డారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: