
దీంతో కష్టపడి పండించిన పంటకు రైతుకు నష్టాలు తప్ప లాభాలు ఉండవు అన్న విషయం దాదాపు అందరికి తెలుసు. కానీ ఏకంగా ఒక రైతు ఖరీదైన కారు కొనుగోలు చేశాడు అంటే నమ్ముతారా.. ఇది నమ్మడానికి కాస్త టైం పడుతుంది. అలాంటిది ఇక్కడ ఒక రైతు మాత్రం లక్షలు విలువ చేసే కారు కొనుగోలు చేయడమే కాదు అదే కారులో ప్రత్యేకంగా మార్కెట్లో ఆకులు అమ్ముతున్నాడు. ఇలా 44 లక్షల విలువైన ఆడి ఏ4 కారులో వెళ్లి ఆకుకూలను విక్రయిస్తూ అందరిని విసుపోయేలా చేస్తూ ఉన్నాడు రైతు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే అతను ఒక తోటలోని తాజా ఎర్ర తోటకూరను కోస్తూ ఉండడం చూడవచ్చు. కావలసినంతవరకు ఇక ఎర్ర తోటకూరను కోసిన అతను ఆడి ఏ4 లక్సరీ కారు వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. రోడ్ సైడ్ మార్కెట్లో ఆకుకూరలు అమ్మడానికి వెళ్ళాడు. మార్కెట్కు చేరుకున్న తర్వాత అతను నేలపై చాప వేసి ఇక ఎర్రటి బచ్చలి కూరను కొనుగోలుదారులకు చూపించడం మొదలుపెట్టారు. నేను ఆడీలో వెళ్లి ఆకుకూరలు అమ్మినప్పుడు అనే ఒక టైటిల్ ని కూడా ఈ వీడియోకి జోడించాడు. అతను ఎవరో కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో గత కొంతకాలం నుండి హాట్ టాపిక్ గా మారిపోయిన ధనిక రైతు సుజిత్.