ఈనెల 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కాంగ్రా జిల్లాలో గల గగల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు అదుపుతప్పి మొదట ఒక బైకు ని ఢీకొని ఆ తర్వాత కారు బోల్తా పడినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరబ్ అతని స్నేహితులు ఖాతుమ్, శుభమ్ తీవ్రమైన గాయాల పాలైనట్లు సమాచారం .అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్నటి రోజున రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి వివరిస్తున్నారు.. ప్రమాదం సంభవించిన వెంటనే కారు డ్రైవర్ షేర్ సింగ్ పరారయ్యారని వెల్లడించారు.. అతని కోసమే ప్రస్తుతం గాలిస్తున్నామంటు పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే డ్రైవర్ మండికి పారిపోయినట్లుగా పోలీసులకు సమాచారం వచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకొని అతని అరెస్టు చేసినట్లుగా కూడా కాంగ్రా పోలీస్ సూపర్డెంట్ షాలిని వెల్లడించింది.. ఐ పీస్ సీ లోని సెక్షన్ 304A,279 మోటార్ వెహికల్ యాక్ట్ లోని 187 సెక్షన్ ద్వారా డ్రైవర్ పైన కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సురేష్ రైనా అభిమానులు ఈ విషయం వినగానే ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.