భారత్ క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా పేరు సంపాదించిన సురేష్ రైనా.. ఎన్నో విజయాలను అందించారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ గా కూడా పేరు సంపాదించారు.తాజాగా సురేష్ రైనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కజిన్ సౌరబ్ (మేనమామ కొడుకు)రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనలో సౌరబ్ తో సహా మరో ఇద్దరు కూడా మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.


ఈనెల 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో  కాంగ్రా  జిల్లాలో గల గగల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు అదుపుతప్పి మొదట ఒక బైకు ని ఢీకొని ఆ తర్వాత కారు బోల్తా పడినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరబ్ అతని స్నేహితులు ఖాతుమ్, శుభమ్ తీవ్రమైన గాయాల పాలైనట్లు సమాచారం .అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్నటి రోజున రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.


అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి వివరిస్తున్నారు.. ప్రమాదం సంభవించిన వెంటనే కారు డ్రైవర్ షేర్ సింగ్ పరారయ్యారని వెల్లడించారు.. అతని కోసమే ప్రస్తుతం గాలిస్తున్నామంటు పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే డ్రైవర్ మండికి పారిపోయినట్లుగా పోలీసులకు సమాచారం వచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకొని అతని అరెస్టు చేసినట్లుగా కూడా కాంగ్రా పోలీస్ సూపర్డెంట్ షాలిని వెల్లడించింది.. ఐ పీస్ సీ లోని సెక్షన్ 304A,279 మోటార్ వెహికల్ యాక్ట్ లోని 187 సెక్షన్ ద్వారా డ్రైవర్ పైన కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సురేష్ రైనా అభిమానులు ఈ విషయం వినగానే ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: