దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహ నిర్బంధం వ్యవహారం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ అయింది. గచ్చిబౌలి లో ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ రోజు 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి సిద్దిపేట జిల్లా బిజెపి పిలుపునిచ్చింది. సిద్దిపేట కలెక్టర్ క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. రైతులకు వరి విత్తనాలు అమ్మితే కచ్చితంగా లైసెన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ చెప్పడంతో బిజెపి సీరియస్ అయింది.

వేసవిలో వరి పంట వేస్తే కేంద్ర ప్రభుత్వం కొనేది లేదని చెప్పడంతో తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా వద్దని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక దుబ్బాక, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 300 పైగా బిజెపి కార్యకర్తల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటన చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp