స్వర్ణముఖీ నది వల్ల బ్రిడ్జిలు కాజ్వేలు అన్ని కొట్టుకుపోయాయని వెల్లడించారు. ఇక్కడ ఉన్న నేతలు చెరువులను కబ్జాలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మరోవైపు తొలుత టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు కొద్ది సేపటివరకు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్జోన్గా గుర్తించామని, గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు చేపడుతుండడంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివరించారు. ఈ తరుణంలోనే చంద్రబాబుకు తాము భద్రత కల్పించలేమని, అందుకే అనుమతి నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కాస్త ఘర్షణకు దిగారు. చంద్రబాబు రాయలచెరువు పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది.
స్వర్ణముఖీ నది వల్ల బ్రిడ్జిలు కాజ్వేలు అన్ని కొట్టుకుపోయాయని వెల్లడించారు. ఇక్కడ ఉన్న నేతలు చెరువులను కబ్జాలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మరోవైపు తొలుత టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు కొద్ది సేపటివరకు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్జోన్గా గుర్తించామని, గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు చేపడుతుండడంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివరించారు. ఈ తరుణంలోనే చంద్రబాబుకు తాము భద్రత కల్పించలేమని, అందుకే అనుమతి నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కాస్త ఘర్షణకు దిగారు. చంద్రబాబు రాయలచెరువు పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది.