ముల్తాని మట్టిలో చెంచా ఆలుగడ్డ గుజ్జు రసం, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆలుగడ్డను తురిమి రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి కోడిగుడ్డు, పెరుగు కలపండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి మొత్తం వెంటుకలకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, షాంపుతో తలంటుకోండి. మీ జట్టుకు బోలెడంత బలం వస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.బంగాళాదుంప రసాన్ని దూదితో ముంచి, దాన్ని కళ్లపై పావుగంట సేపు ఉంచాలి. ఇలా రోజూ చేస్తూ నల్లటి వలయాలు తగ్గుతాయి.
దాని రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి. ముఖంపై తెల్లటి మచ్చలు, ఎండకు కమిలిపోయిన చర్మానికి బంగాళాదుంప రసం రాస్తే చర్మం మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి