దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అప్‌డేట్ ప్ర‌కారం క‌రోనా కేసులు 12 వేల‌కు చేరుకున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు 400కు అతి స‌మీపంలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా తీవ్ర‌స్థాయిలో ఉంది. మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితులు ఎటు వైపున‌కు దారి తీస్తాయో కూడా తెలియ‌డం లేదు. ఇలాంటి టైంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మతా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర గ‌వర్న‌ర్ జ‌గదీప్‌సింగ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది రోజులుగా గ‌వ‌ర్న‌ర్‌ను మ‌మ‌త ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గిట్ట‌నీయ‌డం లేదు. 

 

తాజాగా బెంగాల్లో క‌రోనా కేసులు ఎక్కువ‌గానే ఉన్నా కావాల‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం వీటిని త‌క్కువ చేసి చూపుతోంద‌న్న విమ‌ర్శ‌లు అయితే ఉన్నాయి. తాజాగా గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్‌సింగ్ మ‌మ‌త‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కరోనా క‌ట్ట‌డిలో సీఎం మ‌మ‌త ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో విఫ‌ల‌మైంద‌ని.. ప్ర‌జ‌లు గుంపులుగా ఉండ‌కుండా చేయ‌డంలో .. మ‌త స‌మావేశాలు జ‌ర‌ప‌కుండా అరిక‌ట్ట‌డంలో మ‌మ‌త విఫ‌ల‌మైంద‌ని గ‌వ‌ర్న‌ర్ ఆరోపించారు. వెంట‌నే కేంద్ర బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో రాజ‌కీయంగా ఇప్పుడు పెను దుమారం లేపిన‌ట్ల‌య్యింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: