అదేమిటోగానీ.. కొద్దిరోజులుగా క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల‌ను, నాయ‌కుల‌ను పోల్చుతూ చాలా మంది సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొంద‌రు తెలంగాణ నేత‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటే.. మ‌రికొంద‌రు ఏపీ నాయ‌కుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్నారు. తాజాగా.. జ‌న‌సేన నేత‌, న‌టుడు నాగ‌బాబు చేసిన ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి ఈ మ‌ధ్య మాస్క్ లేకుండా..  అంటే మెడ‌లోమాస్క్ ఉందిగానీ ముక్కుకు పెట్టుకోలేదు. ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు స్పందించారు. విజ‌య‌సాయిగారు.. మాస్క్ పెట్టుకోవాలండీ.. అంటూ ఆ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

 

ఇక ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్క్ పెట్టుకున్న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మాస్క్ వాడుతున్న‌నాయ‌కుడు.. అంటూ ట్వీట్ చేశారు. నాగ‌బాబు చేసిన ట్వీట్ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. కేటీఆర్‌పై ప్ర‌శంస‌లు, విజ‌య‌సాయికి చివాట్లు పెట్ట‌డంలో ఆంత‌ర్యం ఏమిటంటూ మ‌రికొంద‌రు ట్వీట్లు చేస్తున్నారు. ఇది ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో చూడాలి మ‌రి. ఈక్ర‌మంలోనే న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ కూడా ఏపీ నేత‌ల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తెలంగాణ నేత‌ల‌ను చూసి నేర్చుకోండి.. అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: