తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని పోలీ స్టేషన్ లో రంగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఉండే ఒక బాత్ రూమ్ లో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు రోజుల క్రితం అతన్ని పోలీసులు వన్య ప్రాణుల వేట కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అతని గ్రామం రామగిరి మండలం రామయ్య పేట అని పోలీసులు వెల్లడించారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కారణం తెలియదు అని అసలు అతని వెనుక వన్య ప్రాణుల వేటలో ఎవరైనా ఉన్నారా అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.